
- 18వ తేదీ నాటికే టార్గెట్ పూర్తి
- గతంలో దొడ్డు బియ్యం తీసుకున్నది 75 నుంచి 80 శాతం మందే..
హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలోని రేషన్షాపుల్లో సన్నబియ్యానికి భారీ డిమాండ్నెలకొన్నది. ఈనెలలోనే నగరంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో రేషన్షాపుల ముందు లబ్ధిదారులు క్యూలు కట్టి మరీ బియ్యం తీసుకున్నారని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలోని 654 షాపుల ద్వారా ఈ నెల సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈనెల 17వ తేదీ వరకే పంపిణీ చేయగా, 96 శాతం మంది సన్నబియ్యం తీసుకున్నారని చెప్పారు. మొత్తంగా 6,39,175 లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్టు చెప్పారు.
దొడ్డు బియ్యానికి డిమాండ్ తక్కువే..
గత నెల వరకు నగరంలో దొడ్డుబియ్యం ఇవ్వగా ఇంత స్పందన లేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్నెలలో పంపిణీ చేసిన దొడ్డుబియ్యాన్ని 80 శాతం కార్డు దారులు మాత్రమే ఉపయోగించుకున్నారని చెప్పారు. అంతకుముందు అంటే ఏప్రిల్నెలకు ముందు 70 నుంచి 75 శాతం మాత్రమే తీసుకునేవారని, ఏప్రిల్లో మాత్రం అత్యధికంగా 80 శాతం మంది తీసుకున్నారని చెప్పారు.
ప్రభుత్వంపేదలు కూడా సన్నబియ్యంతో భోజనం చేయాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ అనుకున్నట్టుగానే మంచి ఫలితాలు ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.