సర్కారు సన్న బియ్యానికి ఫుల్ డిమాండ్.. హైదరాబాద్ లో 96 శాతం మంది తీస్కున్నరు!

సర్కారు సన్న బియ్యానికి ఫుల్ డిమాండ్..  హైదరాబాద్ లో 96 శాతం మంది తీస్కున్నరు!
  • 18వ తేదీ నాటికే టార్గెట్​ పూర్తి  
  • గతంలో దొడ్డు బియ్యం తీసుకున్నది 75 నుంచి 80 శాతం మందే..

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలోని రేషన్​షాపుల్లో సన్నబియ్యానికి భారీ డిమాండ్​నెలకొన్నది.  ఈనెలలోనే నగరంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో రేషన్​షాపుల ముందు లబ్ధిదారులు క్యూలు కట్టి మరీ బియ్యం తీసుకున్నారని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. 

నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలోని 654 షాపుల ద్వారా ఈ నెల సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈనెల 17వ తేదీ వరకే పంపిణీ చేయగా, 96 శాతం మంది సన్నబియ్యం తీసుకున్నారని చెప్పారు. మొత్తంగా 6,39,175 లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్టు చెప్పారు.  

దొడ్డు బియ్యానికి డిమాండ్​ తక్కువే..

గత నెల వరకు నగరంలో దొడ్డుబియ్యం ఇవ్వగా ఇంత స్పందన లేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్​నెలలో పంపిణీ చేసిన దొడ్డుబియ్యాన్ని 80 శాతం కార్డు దారులు మాత్రమే ఉపయోగించుకున్నారని చెప్పారు. అంతకుముందు అంటే ఏప్రిల్​నెలకు ముందు 70 నుంచి 75 శాతం మాత్రమే తీసుకునేవారని, ఏప్రిల్​లో మాత్రం అత్యధికంగా  80 శాతం మంది తీసుకున్నారని చెప్పారు.

ప్రభుత్వంపేదలు కూడా సన్నబియ్యంతో భోజనం చేయాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ అనుకున్నట్టుగానే మంచి ఫలితాలు ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.