గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని కుందనపల్లి ఎల్సీ గేట్నెంబర్49, పెద్దంపేట గేట్నెంబర్ 51తో పాటు మల్యాలపల్లి, బద్రిపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలను త్వరితగతిన నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్ అనుమాస శ్రీనివాస్ కోరారు.
మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో డీఆర్ఎం గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం విషయంలో ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారని, వారు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు.

