ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : జీవన్ రెడ్డి

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : జీవన్ రెడ్డి

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా జగిత్యాలలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  దేశ ఐక్యతను కాపాడడానికి ఇందిరా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారని చెప్పారు.

బీజేపీ నేతలు ఉగ్రవాదం పేరుతో ప్రజలను రెచ్చగొడ్తున్నారని విమర్శించారు. మనదేశ ఎంపీలకు అనుమతి ఇవ్వకుండా, యూరోపియన్ ఎంపీలను కశ్మీర్ పర్యటనకు తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.