దేవుడి భూమికే ఎసరు.. కబ్జా చేసి ప్రహారీ గోడ

దేవుడి భూమికే ఎసరు..    కబ్జా చేసి ప్రహారీ గోడ

మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ముమ్మరంగా  నిర్వహిస్తున్నారు. నెక్నాంపూర్ లో దేవాదాయశాఖ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపించారు.  కోట్ల రూపాయల భూమిని  ఓ రియాల్టర్  కబ్జా చేసి ప్రహారీ గోడలు నిర్మించగా..  కబ్జా చేసిన భూమిని ఓ కేటుగాడు అమ్మకానికి పెట్టాడు.  దీంతో విషయం అధికారుల దృష్టికి రావడంతో  2024 మార్చి 22వ తేదీ తెల్లవారుజామునే కూల్చివేత ప్రక్రియ మొదలు పెట్టారు అధికారుల బృందం. భారీ పోలీసు బందోబస్తు మద్య కూల్చివేతలు చేపట్టారు దేవాదాయ శాఖ అధికారులు.