మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. నెక్నాంపూర్ లో దేవాదాయశాఖ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపించారు. కోట్ల రూపాయల భూమిని ఓ రియాల్టర్ కబ్జా చేసి ప్రహారీ గోడలు నిర్మించగా.. కబ్జా చేసిన భూమిని ఓ కేటుగాడు అమ్మకానికి పెట్టాడు. దీంతో విషయం అధికారుల దృష్టికి రావడంతో 2024 మార్చి 22వ తేదీ తెల్లవారుజామునే కూల్చివేత ప్రక్రియ మొదలు పెట్టారు అధికారుల బృందం. భారీ పోలీసు బందోబస్తు మద్య కూల్చివేతలు చేపట్టారు దేవాదాయ శాఖ అధికారులు.