
రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ మేరకు కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ విద్యుత్ సబ్స్టేషన్ప్రారంభ ఏర్పాట్లను ఆయన కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పరిశీలించారు. చెన్నాపూర్లో సబ్సేషన్ ప్రారంభించిన అనంతరం ఆఫీసర్లతో సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్కు చేరుకుంటారని చిట్యాల, నవాబ్పేట, ధర్మరావుపేటలో నిర్మించనున్న సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
మంజూర్నగర్లో ప్రజాపాలన సభ ఉంటుందని కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలోని పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్పూర్, వెంకటేశ్వర్లపల్లి, కొనరావుపేట, కొత్తపల్లి, రాజక్కపల్లి, చిన్నకొడెపాక, కొత్తపల్లిగోరి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇప్పకాయల నర్సయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.