హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్షిప్లు నిర్మించి ఆదాయం సృష్టించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి హెచ్ఎండీఏ గుండెకాయగా నిలవాలని సూచించారు. గురువారం సెక్రటేరియెట్లో 2024 – 25 బడ్జెట్కు సంబంధించి స్టేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రూపొందించిన ప్రతిపాదనలపై భట్టి విక్రమార్క సంబంధిత అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం.. రోడ్ల విస్తరణకు అవకాశం ఉన్న ప్రాంతాలను మార్క్ చేయాలన్నారు. ల్లో టెండర్ల ద్వారా భూములు దక్కించుకున్నవారు వాటిని వినియోగించుకుంటున్నారా? లేదా? చూడాలని ఆదేశించారు.
ఖాళీగా ఉంటే వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఇది సాధ్యం కాకుంటే.. అందులో ప్రభుత్వానికి రావాల్సిన వాటాను రాబట్టాలని సూచించారు. చెరువుల సంఖ్య తేల్చాలి హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల సంఖ్య ఒక్కో సందర్భంలో ఒక్కోలా చెప్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. అసలు చెరువులు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాటిని పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఖ్యాతి పెంచేందుకు రాష్ట్ర సర్కార్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి నాలుగు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తున్నదన్నారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడం, గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా అభివృద్ధి చేయడం, మూసీని ప్రక్షాళన చేసి హైదరాబాద్ షాన్ను పెంచడం ప్రధాన లక్ష్యాలు అని వివరించారు.
జూన్ నాటికి మూసీ ప్రక్షాళన హైదరాబాద్లో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. మూసీ ప్రక్షాళన పనులు జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. వెంచర్లను రియల్టర్లు డెవలప్చేయడం లేదని, దానిపై హెచ్ఎండీఏ అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కింద 39లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. రివ్యూ మీటింగ్లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రోనాల్డ్ రాస్, మున్సిపల్ డైరెక్టర్ దివ్య, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.