హైదరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనోజ్ సాహు అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన జిల్లా స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) నోడల్ ఆఫీసర్ల డు రోజుల ఈసీఐ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 73.37 శాతం ఓటింగ్ రికార్డవగా తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అది 62.77 శాతానికి తగ్గిందని గుర్తుచేశారు.