ప్రధాన నిందితుడు సుధాకర్ అరెస్ట్
హైదరాబాద్: అతనో కరుడుగట్టిన నేరస్తుడు. 59 కేసుల్లో 17 సార్లు జైలుకెళ్లి వచ్చాడు. అయినా అతడిలో పరివర్తన రాలేదు సరికదా భార్యను కూడా వెంటబెట్టుకుని దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. గత అక్టోబర్ 21వ తేదీన చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దోమలగూడలో జరిగిన దొంగతనం కేసును ఛేదించారు హైదరాబాద్ పోలీసులు.
నిందితుడు సుధాకర్ ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీ చేయడం స్పెషాలిటీ అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. చిక్కడపల్లి పీఎస్ పరిధిలో 70 తులాల బంగారం దొంగతనం జరగగా 44 తులాల గోల్డ్ రికవరీ చేశామన్నారు. మిగిలిన బంగారాన్ని ఇతర పట్టణాల్లో విక్రయించడంతో ఆ సొత్తును కూడా రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు సుధాకర్ గత అక్టోబర్ 21వ తేదీన దోమలగూడలోని స్వామి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి చోరీ చేశారని చెప్పారు. మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లారని, గోల్డ్ బిస్కట్స్, ఆభరణాలు దొంగలించారని వివరించారు. సీసీ కెమెరాలు, లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామన్నారు.
ఈ కేసులో భార్యా భర్తలు ఇద్దరు కీలక సూత్రదారులు
చోరీ కేసులో భార్యా భర్తలు ఇద్దరు కీలక సూత్రధారులని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు సుధాకర్ ను అరెస్ట్ చేసామన్నారు. ఇతనిపై గతంలో 59 కేసులు ఉంటే 17 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని, భార్య నాగమణి తో కలిసి వరుస దొంగతనాలు చేసేవాడన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తగా, తెలివిగా దొంగతనాలు చేసేవారని సీపీ అంజనీకుమార్ వివరించారు.
ఇవి కూడా చదవండి
రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత
రేపట్నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర
బాత్రూంలు బాగోలేవని బాలిక ఫిర్యాదు.. క్లీన్ చేసిన మంత్రి