కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

కృష్ణా జలాల విషయంలో రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్. ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్‌లోని నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఘట్‌కేసర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. ఆ తర్వాత  మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని భావించి.. ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు.