శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు పోటెత్తిన భక్తులు

తిరువనంతపురం : శబరిమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు, పోలీసులకు మాలధారులను అదుపు చేయడం కష్టంగా‌ మారింది. అయ్యప్ప స్వామి ప్రధాన సన్నిధానం లోనూ, ఆలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ముందుకు తీసుకుని అయ్యప్ప స్వాములు దర్శనం కోసం వెళ్లుతున్నారు. సన్నిధానంలో విపరీతమైన రద్దీ పెరగడంతో పతనం తిట్ట, నిలక్కల్‌ లో కేఎస్ఆర్టీసీ బస్సులు సహా, ప్రైవేటు వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచి పోయాయి.

శబరిమల కు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఏర్పడింది. ఒక వైపు కాలిబాట, మరోవైపు సన్నిధానం లోని అన్ని ద్వారాలు భక్తులతో నిండి పోయాయి. రద్దీ దృష్ట్యా గత రాత్రి 11 గంటలకు పంపా వద్దకు వచ్చిన భక్తులను సన్నిధానంలోకి అనుమతించడం లేదు. దీంతో  అక్కడ సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అయ్యప్ప దర్శనం కోసం 12 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.