పెంపుడు కుక్కతో తిరుమలకు వెళ్లకూడదా.. వెళితే ఏమౌతుంది

పెంపుడు కుక్కతో తిరుమలకు వెళ్లకూడదా.. వెళితే ఏమౌతుంది

టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ఓ కుక్క ముప్ప తిప్పలు పెట్టింది.  దర్జాగా టెంపో వాహనంలో తిరుమల కొండపై దర్జాగా ప్రయాణం చేసింది.  వెంకన్న కొండకు జంతువులు రాకూడదన్న నిబంధన ఉన్నా... ఆ కుక్కకు మాత్రం వెంకన్న ఆశీర్వాదం లభించిందేమో తెలియదు కాని.. తనిఖీల సమయంలో సిబ్బంది కళ్లుగప్పి కొండపైకి చేరింది.  

తిరుమల శ్రీవారి దర్శనానికి పెంపుడు కుక్కతో వచ్చిన కర్ణాటక భక్తులు టిటిడి విజిలెన్స్ సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టారు. అల్లారు ముద్దుగా ఇంట్లో పెంచుకున్న పెంపుడు జంతువుతో సహా వారు తిరుమలకు విచ్చేశారు. ఇంటి ఇలవేల్పును కొలిచేందుకు తమ పెంపుడు కుక్కను కూడా వెంటపెట్టుకుని టెంపో ట్రావెలర్ లో తిరుమల యాత్రకు వచ్చారు కర్ణాటక భక్తులు. ఈ క్రమంలోనే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరిలోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద టెంపో ట్రావెలర్ లో కుక్కను గమనించకుండా అనుమతించారు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది. దీంతో సదరు పెంపుడు కుక్క దర్జాగా కొండెక్కింది.

ALSO READ:భేటీకే పీఛే!.. అఖిలేశ్​ హైదరాబాద్ ఎందుకొచ్చారు?

తిరుమలలో పెంపుడు జంతువులకు అనుమతి లేదని తెలియకుండా వెంట తీసుకెళ్లిన భక్తులతో కుక్క తిరుమల చేరుకుంది. తిరుమల రామ్ భగీచా బస్టాండ్ వద్ద మీడియా కంట పడింది. వాహనంలో తిరుమల శ్రీవారి ఆలయం వైపు చూస్తున్న కుక్కను గమనించిన మీడియా తమ కెమెరాల్లో బంధించింది. దీంతో విషయం విజిలెన్స్ సిబ్బందికి తెలిసి పోయింది. వెంటనే అలర్ట్ అయిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కుక్క ఉన్న టెంపో ట్రావెలర్ కోసం వెతకడం ప్రారంభించారు.  టెంపో ట్రావెలర్ పార్కింగ్ చేసిన కర్ణాటక భక్తుల వాహనాన్ని గుర్తించి తిరుమల కొండ దింపేశారు.