హైదరాబాద్ : ఏప్రిల్ 30 న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం భవనంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్, సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం (ఏప్రిల్ 28న) పరిశీలించారు.
టీ.ఎస్.ఎస్.పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా, లా అండ్ ఆర్డర్ విభాగం ఏడీజీ సంజయ్ జైన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, అడిషనల్ సీపీ సుధీర్ బాబుతో కలసి నూతన సచివాలయం ప్రాంగణంలో మొత్తం తిరిగి ఏర్పాట్లను డీజీపీ పరిశీలించారు.
ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే సభ, వీవీఐపీల ప్రవేశం, పార్కింగ్ ఏర్పాట్లు, సచివాలయంలోకి సిబ్బంది, అధికారుల ప్రవేశ మార్గంలో బందోబస్తు వంటి ఏర్పాట్లను డీజీపీ అధికారులతో కలిసి సమీక్షించారు.