లాక్ డౌన్ రూల్స్ బ్రేక్..రూ.కోట్ల జ‌రిమానాలు

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్..రూ.కోట్ల జ‌రిమానాలు

హైదరాబాద్: హైకోర్టుకు డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 150 కేసులు నమోదయ్యాయని డీజీపీ తన నివేదికలో తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపిన ఆయ‌రన‌.. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు, రూ.35.81 కోట్ల జరిమానా విధించామన్నారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటించనందుకు  41,872 కేసులు నమోదు చేశామన్నారు. జనం గుమిగుడినందుకు 13,867 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామని డీజీపీ నివేదికలో తెలిపారు. అలాగే లాక్ డౌన్ ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.