నిమజ్జనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలె

నిమజ్జనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలె

హైదరాబాద్: హైదరాబాద్ లో కొనసాగుతున్న శోభాయాత్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను డీజీపీ మహేందర్ రెడ్డి సీసీ టీవీల ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డీజీపీ ఆదేశించారు. హైదరాబాద్ లో కొనసాగుతున్న శోభా యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 35 వేల మంది పోలీసులను మోహరించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. శోభాయాత్ర ప్రశాంత సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని  డీజీపీ కోరారు.