- డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సైబర్ క్రైమ్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ వ్యవస్థను పటిష్టంగా మారుస్తున్నామని తెలిపారు. శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో సైబర్ సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డైరెక్టర్ పౌసమి బసుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల కట్టడిపై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.