తెలంగాణ డీజీపీ ముందు 41 మంది మావోలు లొంగుబాటు

తెలంగాణ డీజీపీ ముందు 41 మంది మావోలు లొంగుబాటు

మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది . ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న 41 మంది మావోయిస్టులు  తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న 35 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇది మావోయిస్టు వ్యవస్థకు గట్టి దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.

 పోలీసుల నిరంతర కూంబింగ్ ఆపరేషన్లు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆకర్షణీయమైన పునరావాస విధానాల పట్ల ఆకర్షితులై వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయంతో పాటు, గౌరవప్రదమైన పునరావాసం,ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ భారీ లొంగుబాటుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మరికాసేపట్లో మీడియా ముందు వెల్లడించనున్నారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.