
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 7 జిల్లాలకు కొత్త డీఎంహెచ్వోలను నియమిస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాలకు డాక్టర్ సుబ్బారాయుడు, నారాయణపేటకు సౌభాగ్య లక్ష్మి, వనపర్తికి జయ చంద్రమోహన్, భూపాలపల్లికి మధుసూదన్, మేడ్చల్కు రఘునాథస్వామి, భువనగిరికి పరిపూర్ణ చారి, జనగామకు సాయి శోభను డీఎంహెచ్వోగా నియమించారు. వికారాబాద్ జోన్, కూకట్పల్లి జోన్కు సబావత్ దుర్గా రామ్కుమార్, ఖైరతాబాద్ జోన్కు పుట్ల శ్రీనివాస్, చార్మినార్ జోన్కు బద్దం రాజాశ్రీని డీఎంహెచ్వోగా నియమించారు.