డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటిస్తూ కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ధనుష్. ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ రూపొందిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది.
బుధవారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 15న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని పొంగల్కి పోస్ట్ పోన్ చేశారు. 2024 పొంగల్కి ‘కెప్టెన్ మిల్లర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రకటించారు.
ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజీ త్యాగరాజన్ సమర్పణలో జి. శరవణన్ , సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.