ఎంఎన్​ఆర్​ కాలేజీ గేటు ఎదుట మెడికల్ ​స్టూడెంట్ల ధర్నా

ఎంఎన్​ఆర్​ కాలేజీ గేటు ఎదుట మెడికల్ ​స్టూడెంట్ల ధర్నా

కంది, వెలుగు: మహిళా పీజీ స్టూడెంట్స్​ను వేధిస్తున్న ఎంఎన్ఆర్​ మెడికల్ ​కాలేజీ ఏడీను సస్పెండ్​చేయాలంటూ స్టూడెంట్లు ధర్నాకు దిగారు. సంగారెడ్డి మండలంలోని  కాలేజీ గేట్​ముందు బుధవారం పీజీ స్టూడెంట్స్​బైఠాయించి మేనేజ్​మెంట్, అసిస్టెండ్​డైరెక్టర్(ఏడీ)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతకాలంగా ఏడీ చెకింగ్​పేరిట రాత్రి పూట హాస్పిటల్​లోని మహిళా పీజీ స్టూడెంట్ల రూంలలో, వాష్​ రూంలలో, బెడ్ల కింద చెక్​చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పలుసార్లు కాలేజీ వీసీ, ప్రిన్సిపల్ తదితరులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 

మంగళవారం రాత్రి కూడా రూంలలోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించాడన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పైకి వచ్చి ధర్నా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేనేజ్​మెంట్​స్పందించి ఏడీని సస్పెండ్​చేయాలని డిమాండ్​చేశారు. కాలేజీ డాక్టర్లు వచ్చి మరోసారి ఏడీ హాస్పిటల్​వైపు రాకుండా చర్యలు తీసుకుంటామని, క్షమాపణలు చెప్పిస్తామని అన్నారు. ధర్నా విరమించి డ్యూటీలో చేరాలని  కోరారు. ఏడీని సస్పెండ్​ చేసేవరకు దశలవారీగా ధర్నా కొనసాగిస్తామని స్టూడెంట్స్​ తేల్చి చెప్పారు.