ఫార్మా కంపెనీ మూసేయాలని ధర్నా

ఫార్మా కంపెనీ మూసేయాలని ధర్నా

గండీడ్, వెలుగు: మహమ్మదాబాద్ మండలంలోని దేశాయిపల్లి సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీని పూర్తిగా మూసివేయాలని గ్రామస్తులు శుక్రవారం చించోళి ప్రధాన రహదారిపై  ధర్నా చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఫార్మా కంపెనీ నుంచి వచ్చే దుర్వాసనతో ఆరోగ్యం పాడువుతుందని వాపోయారు. గతంలో ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో సర్పంచి రఘుయాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.