టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) వన్డే టీమ్ ఆఫ్ ది డికేడ్ కెప్టెన్గా మహీ ఎన్నికయ్యాడు. భారత్ కు ఎన్నో విజయాలను అందించిన ధోనీని టీ20 కప్, 2011 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అదించిన అతడికి ఈ దశాబ్దపు కెప్టెన్గా ఎంచుకుంది. ఈ జాబితాలో ధోనీతో పాటు ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కూడా స్థానం దక్కింది. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా ధోని సేవలను కొనియాడింది. ఓటమితో కొనసాగుతున్న జట్టును విజయ తీరాలకు చేర్చిన అతడి ఘనత చిరస్మరణీయమని ఆకాశానికి ఎత్తింది. వరల్డ్కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత ధోని మళ్లీ ఆడలేదు. టెస్ట్ టీం ను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా(CA) ప్రకటించింది. ఆ జట్టుకు కెప్టెన్గా విరాట్ కోహ్లీని ఎన్నిక చేసింది.
క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టు : రోహిత్ శర్మ, హాషీం ఆమ్లా, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిల్లీర్స్, షకిబ్ అల్ హసన్, జోస్ బట్లర్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, రషీద్ ఖాన్.
క్రికెట్ ఆస్ట్రేలియా టెస్టు జట్టు : అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డెవిల్లీర్స్, బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లైన్, జేమ్స్ అండర్సన్.