యూనిక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో వస్తున్న ధీర

యూనిక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో వస్తున్న ధీర

లక్ష్ చదలవాడ(Lakshy) హీరోగా విక్రాంత్ శ్రీనివాస్(Vikranth Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధీర(Dheera). చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి నిర్మించారు.  ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ ‘పాతికేళ్లుగా చదలవాడ బ్రదర్స్‌‌‌‌ని చూస్తున్నా. ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. లక్ష్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి. ప్రేక్షకులు సినిమాను విజయవంతం చేయాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. దర్శకులు గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన, వైవీఎస్ చౌదరి, అజయ్ కుమార్, నిర్మాతలు దామోదర ప్రసాద్, తుమ్మల ప్రసన్న కుమార్, బెక్కెం వేణుగోపాల్, విజయ రామరాజు, సిల్లీ మాంక్స్ అనిల్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

హీరో లక్ష్ మాట్లాడుతూ ‘పక్కనోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేస్తుండే యువకుడికి ఓ మిషన్ ఇస్తే.. ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యలు ఇందులో చూపించాం. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అన్నాడు. యూనిక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు చెప్పాడు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో విక్రాంత్‌‌‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. తండ్రిగా లక్ష్‌‌‌‌ను చూసి గర్విస్తుంటాను. ఇక ‘రికార్డ్ బ్రేక్‌‌‌‌’ అనే గ్రాఫిక్స్‌‌‌‌ సినిమాతో పాటు దాదాపు పదహారు సినిమాలు మా సంస్థ నుంచి రాబోతున్నాయి’ అని అన్నారు.