నేను ఫస్ట్ సిటిజన్ ను.. నన్నే సెక్రటేరియేట్ కు పిల్వలేదు : గవర్నర్ తమిళిసై

నేను ఫస్ట్ సిటిజన్ ను.. నన్నే సెక్రటేరియేట్ కు పిల్వలేదు : గవర్నర్ తమిళిసై

తెలంగాణ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. కొత్త సెక్రటేరియేట్ ప్రారంబోత్సవానికి తనను ఆహ్వానించాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారామె. ఫస్ట్ సిటిజన్ అయినా తనను పిలవకపోవడం బాధాకరమన్నారు. మే 3వ తేదీ బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సేవాభారతీ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల కోసం తాను పని చేయనని.. ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు గవర్నర్. సేవ చేయడానికే ఇక్కడకు వచ్చానన్నారు. చేయని పనులను కూడా కొంతమంది చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలిపారు. రాజ్ భవన్, ప్రగతిభవన్ ఒక్కటి కాదన్న గవర్నర్.. ఎవరు స్వార్థం కోసం పనిచేయకూడదన్నారు. ఇతర దేశాధినేతలనైనా కాలవొచ్చుకానీ.. ఈ రాష్ట్ర సీఎంను కలవలేమని గవర్నర్ విమర్శించారు. 

https://youtu.be/ZLC3pcgPrWw