
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ, పేదల కోసం చేసిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర 2 (Yatra 2) మూవీ తెరకెక్కుతోంది. డైరెక్టర్ మహి వి రాఘవ్ (Mahi V Raghav) తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతుంది.
ఇవాళ మంగళవారం(ఫిబ్రవరి 6న) యాత్ర 2 మేకర్స్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ మహి వీ రాఘవ్ మాట్లాడుతూ..యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్రెడ్డి గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. అసలు ఆ అంశాలను టచ్ చేయలేదు. ఈ మూవీలో కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట..ఆ మాట కోసం చేసిన ప్రయాణం అనే పాయింట్ చుట్టూనే కథంతా తిరుగుతుంది.
ALSO READ :- ఓటీటీలోకి ది కేరళ స్టోరీ .. ఎప్పటినుంచి అంటే?
ఇక ఢిల్లీ పెద్దలను ఎదురించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఇందులో నేను ఎవ్వరినీ కించపరిచేలా క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలే అని డైరెక్టర్ మహి వి రాఘవ్ అన్నారు. బయట ఆ 2009 టైములో నిజానిజాలు జనాలకు తెలుసు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి సినిమాలో చూపించలేదని డైరెక్టర్ తెలిపారు.