రాజాసాబ్ ఆలస్యం.. మెగాస్టార్తో సినిమా.. మారుతీ కామెంట్స్ వైరల్

రాజాసాబ్ ఆలస్యం.. మెగాస్టార్తో సినిమా.. మారుతీ కామెంట్స్ వైరల్

తెలుగు సినీ లవర్స్ కి దర్శకుడు మారుతీ(Maruthi) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తీసినవి కొన్ని సినిమాలే అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. బస్ స్టాప్(Bus Stop) సినిమాతో కెరీర్ ప్రారంభించిన మారుతీ.. ప్రేమకథాచిత్రం(Premaktaha Chitram)తో మంచి పాపులారిటీను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తరువార్త వచ్చిన భలే భలే మొగాడివోయ్ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు. ఇటీవలే గోపీచంద్ తో పక్కా కమర్షియల్ తీసి ప్లాప్ ను మూటగట్టుకున్న ఈ దర్శకుడు.. నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అనౌన్స్ చేసి ఇండస్ట్రీని అవాక్కయ్యేలా చేశాడు. 

రాజాసాబ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఇటీవలే సంక్రాంతి కానుకగా లాంఛనంగా మొదలయ్యింది. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతీ రాజాసాబ్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అదేంటంటే.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో రాజాసాబ్ మూవీ ఆలస్యం అవుతుందని భావించడతా దర్శకుడు మారుతీ. అందుకే ఈ గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడట. 

దానికి సంబందించిన కథను కూడా మెగాస్టార్ కు వినిపించాడట. కథ నచ్చడంతో చిరు కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. పక్కా మాస్ కాన్సెప్ట్ తో, మెగాస్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అదే రేంజ్ లో కథను సిద్ధం చేశాడట మారుతీ. కానీ, సలార్ రిలీజ్ తరువాత ప్రభాస్ కాస్త ఫ్రీ అవడంతో రాజాసాబ్ సినిమా పట్టాలెక్కించాడట. ఒకవేళ రాజాసాబ్ షూట్ లేట్ అయుంటే ఖచ్చితంగా మెగాస్టార్ తో సినిమా చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు మారుతీ. ప్రస్తుతం మారుతీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.