Rajamouli: జపాన్లో భూకంపం.. రాజమౌళికి తప్పిన ప్రమాదం.. కొడుకు కార్తికేయ పోస్ట్ వైరల్

Rajamouli: జపాన్లో భూకంపం.. రాజమౌళికి తప్పిన ప్రమాదం.. కొడుకు కార్తికేయ పోస్ట్ వైరల్

ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కి పెను ప్రమాదం తప్పింది. ఆర్ఆర్ఆర్ స్పెషల్ షో కోసం జపాన్ వెళ్లిన రాజమౌళి కుటుంబం అక్కడ వచ్చిన భూకంపం బారి నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

జపాన్​లో ఇప్పుడే భూకంపం ఎలా ఉంటుందో చూశాము. ఒక బిల్డింగ్ లో మేము 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్ మెళ్లిగా కదలడం మొదలయింది. అది భూకంపం వల్లేనని అర్థమై టెన్షన్ పడ్డాం కానీ, మా చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నారు. పక్కన ఏదో వాన పడుతున్నట్టు లైట్ తీసుకున్నారు. మొత్తానికి ఈ పర్యటనలో భూకంపం ఎలా ఉంటుంది ఎక్స్​పీరియెన్స్ చేశాం.. అంటూ రాసుకొచ్చారు కార్తికేయ. ప్రస్తుతం కార్తికేయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రానున్న ఈ సినిమాకి సంబందించిన కథ ఇప్పటికే కంప్లీట్ అవగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి. 

ALSO READ :- ఫీజులు చెల్లించలేదని.. విద్యార్థులను బస్సుల్లో కూర్చోబెట్టారు