
టైగర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపును అందుకున్న వీఐ ఆనంద్ రూపొందించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వీఐ ఆనంద్ ఇలా మాట్లాడారు.
‘‘టైగర్ చిత్రం తర్వాత సందీప్తో మరో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. ఈ కథతో అది కుదిరింది. బిగ్ స్క్రీన్పై విజువల్, సౌండ్ పరంగా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. భసవలింగం అనే యువకుడు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ప్రాంతంలో దొంగతనం చేసుకుని వెళుతూ, తనకు తెలియకుండానే ఒక ఊరిలో ఆగిపోతాడు. ఆ ఊరు పేరే భైరవకోన. అతను అక్కడికి వెళ్లాడా, లేక ఆ ఊరే అతన్ని రప్పించిందా..? అక్కడ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు... అతనికి, ఆ ఊరుకి ఉన్న సంబంధం ఏమిటి..? ఆ రెండు రాత్రులు అతన్ని మరో మనిషిగా ఎలా మార్చాయన్నది అసలు కథ.
ఈ కథలో కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివ దండం లాంటి నేపథ్యాలు ఉంటాయి. ప్రతి పది నిమిషాలకు ఊహించని మలుపులు ఉంటాయి. స్క్రీన్ప్లే ఎంగేజింగ్గా ఉంటుంది. మరోవైపు ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా ఉంటుంది. డాక్టర్ నారప్ప అనే హిలేరియస్ క్యారెక్టర్లో వెన్నెల కిశోర్ నవ్విస్తారు. అలాగే వైవా హర్ష పాత్ర కూడా ఫన్ రైడ్లా సాగుతుంది. వర్ష బొల్లమ్మ మంచి క్యారెక్టర్ చేసింది. ఇందులోని ‘నిజమేనే చెబుతున్నా’ పాటకు అద్భుతమైన రీచ్ వచ్చింది. ఓపెనింగ్స్కు ఈ పాట బాగా హెల్ప్ అవుతుంది. నిర్మాతలు అనిల్ సుంకర, రాజేష్ దండా కథకు కావాల్సిన ప్రతిది సమకూర్చారు. యూత్, ఫ్యామిలీతో పాటు అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇక నిఖిల్తో ఓ సినిమా చర్చల్లో ఉంది. అలాగే ఓ స్టార్ హీరోకి కథ రాస్తున్నా. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తా”