హైదరాబాద్ సిటీ, వెలుగు: షాపుల నిర్వాహకులు తమ ట్రేడ్ లైసెన్స్ను కనిపించేట్టు పెట్టుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్కార్పొరేషన్కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి సూచించారు. గురువారం కుషాయిగూడ, వైష్ణవి ఎన్క్లేవ్, సాధన విహార్, భవానీ నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కుషాయిగూడ రోడ్ నంబర్ –5లో కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు.
రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. వైష్ణవి ఎన్క్లేవ్లో నిర్మాణంలో ఉన్న థీమ్ పార్క్ పనులను ఆయన సమీక్షించారు. మే 15 నాటికి ప్లే ఏరియా, యాంఫీ థియేటర్(బహిరంగ వేదిక), క్యాంటీన్ తో పాటు పచ్చదనం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
