మెదక్​లో బీజేపీ జెండా ఎగరేయాలి : అభయ్​పటేల్​

మెదక్​లో బీజేపీ జెండా ఎగరేయాలి : అభయ్​పటేల్​

మెదక్ టౌన్, వెలుగు :  మెదక్​నియోజకవర్గంలో బీజేపీ గెలుపునకు ప్రతి కార్యకర్త పని చేయాలని మెదక్​ జోనల్​ఇన్​చార్జి, కర్నాటక ఎమ్మెల్యే అభయ్​పటేల్​ అన్నారు. బుధవారం మెదక్​ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మెదక్​ నియోజకవర్గానికి చెందిన ఆయా విభాగాల బాధ్యులతో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభయ్​ పటేల్​ మాట్లాడుతూ మెదక్​ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్​లో ఉన్న కమిటీని బలోపేతం చేస్తూ  మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలు తెలియజేయాలని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కాంగ్రెస్​ వైఫల్యాలను, మోసాలను ప్రజలకు చేరేలా ప్రచారం చేయాలని సూచించారు.