కోడిగుడ్ల లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా పడగా.. గుడ్లను ఎత్తుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రాజీవ్రహదారిపై గల శంకర్నగర్వద్ద ఆదివారం కోడి గుడ్ల లోడ్తో వెళ్తున్న టాటా ఎస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆటో డ్రైవర్కు గాయాలు కావడంతో ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్కు తరలించారు. కాగా, ప్రమాదానికి గురైన వాహనంలో ఉన్న కోడి గుడ్లను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఒక్కొక్కరు ట్రేలకొద్దీ గుడ్లను ఎత్తుకెళ్లారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవాల్సింది పోయి.. గుడ్లను ఎత్తుకెళ్లడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
