మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : వైవీ.గణేశ్

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : వైవీ.గణేశ్

హనుమకొండ సిటీ, వెలుగు: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి కి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వైవీ.గణేశ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై  ఆఫీసర్లతో చర్చించారు.

ఈ నెల 20 నుంచి 26 వరకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై రూపొందించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో జయంతి, డీఎంహెచ్వో అప్పయ్య, పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు, డీఐఈవో గోపాల్, డీఈవో వాసంతి, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నియంత్రణపై చర్యలు తీసుకోవాలి

జనగామ అర్బన్/ ములుగు : మత్తు పదార్ధాల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని జనగామ అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​ కుమార్, ములుగు అడిషనల్​ కలెక్టర్​ మహేందర్​జీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో నషాముక్త భారత్​ అభియాన్​లో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. నార్కోటిక్స్​పదార్ధాల నియంత్రణ పై తీసుకుంటున్న చర్యలను సంబంధిత కమిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

జిల్లాల్లో రైల్వే, బస్​ స్టేషన్లలో తనిఖీలు చేపట్టాలన్నారు. జూన్​20 నుంచి 26 వరకు స్కూల్స్​, కాలేజీలలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.