నర్సింగ్ కాలేజీకి వ్యతిరేకం కాదు

నర్సింగ్ కాలేజీకి  వ్యతిరేకం కాదు

పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలో నర్సింగ్ కాలేజీ  నిర్మించడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు  మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇదే విషయంపై   బుధవారం ఢిల్లీ నుంచి పత్రిక ప్రకటన విడుదల చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో  వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు BJPY నాయకుల తో పాటు అఖిల పక్ష  నేతలను అరెస్ట్ చేయడాన్ని డీకే అరుణ ఖండించారు. తాను మంత్రిగా ఉన్నపుడు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే..ఇప్పడు అదే స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని  ప్రశ్నించారు.

TRSనాయకులకు భూములను విచ్చలవిడిగా కబ్జాలు చేయడం వస్తుంది.. కానీ నర్సింగ్ కాలేజీ కోసం భూమి దొరకడం లేదా అని  ప్రశ్నించారు డీకే అరుణ. గద్వాల్ లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నపటికీ.. కావాలనే పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు చేపట్టడం దేనికి సంకేతమన్నారు. వైద్య శాఖ మంత్రికి కనీసం జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నర్సింగ్ కాలేజీకి తాము వ్యతిరేకం కాదని, పేదల పట్టాలు ఇచ్చిన స్థలంలో నిర్మాణం చేసి రెచ్చ గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పత్రిక ప్రకటన ద్వారా విమర్శించారు. కచ్చితంగా ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఉసురు తాకుతుందన్న డీకే...పేద ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనన్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్ లో క్రైమ్ రేట్ పెరిగింది