కేసీఆర్ మరోసారి దగా చేసేందుకు రెడీ అయ్యిండు: డీకే అరుణ

కేసీఆర్ మరోసారి దగా చేసేందుకు రెడీ అయ్యిండు: డీకే అరుణ

మహబూబ్​నగర్​ : ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడాలని కేసీఆర్ కు శాపం ఉందేమోనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందుకే కేసీఆర్ నిత్యం అబద్ధాలే చెబుతారన్నారు. మంగళవారం మహబూబ్​నగర్ లో అరుణ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులను ఎన్నో సార్లు మోసం చేసిన కేసీఆర్ మరోసారి.. దగా చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక .. ఇప్పుడు దేశాన్ని దోచుకొనేందుకు బయలు దేరారని విమర్శించారు. ప్రధాని మోడీని తిట్టేందుకే కేసీఆర్.. అసెంబ్లీ పెట్టారని ఫైర్​ అయ్యారు. తాను చెప్పిన మాటల్లో అబద్ధం ఉంటే పదవికి రాజీనామా చేస్తానన్న కేసీఆర్.. ఇప్పటికి ఎన్ని సార్లు రాజీనామా చేయాలో? తన తల ఎన్ని సార్లు నరుక్కోవాలో? అని ధ్వజమెత్తారు.