పోలీసులు ప్రజల కోసం పని చేయాలి

పోలీసులు ప్రజల కోసం పని చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం వస్తుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రంలో TRS నాయకులు ప్రధాన మంత్రి శవ యాత్రలు చేస్తుంటే.. పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ( సోమవారం) సాయంత్రం ఢిల్లీ నుంచి పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ..  ప్రజా సమస్యల పై బీజేపీ నిరసనలకు పిలుపునిస్తే ..ముందస్తు అరెస్టుల పేరుతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పత్రిక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. TRS పార్టీ  నేతలు నిరసనలు చేస్తుంటే డీజీపీ మహేందర్ రెడ్డి కి కనిపించడం లేదా అంటూ  ప్రశ్నించారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలి కానీ.. తెలంగాణ లో మాత్రం అధికార పార్టీ నాయకులచే శబాష్ అనిపించుకునేందుకు పోలీస్ అధికారులు పోటీ పడుతున్నట్టు ఉందన్నారు. ఇప్పటికైన పోలీస్ అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని.. లేదంటే ప్రజల నుంచి మరింత వ్యతిరేకతను ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఎప్పుడూ TRS పార్టీ మాత్రమే అధికారంలో ఉండదన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు  డీకే అరుణ.