తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం వస్తుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రంలో TRS నాయకులు ప్రధాన మంత్రి శవ యాత్రలు చేస్తుంటే.. పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ( సోమవారం) సాయంత్రం ఢిల్లీ నుంచి పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ.. ప్రజా సమస్యల పై బీజేపీ నిరసనలకు పిలుపునిస్తే ..ముందస్తు అరెస్టుల పేరుతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పత్రిక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. TRS పార్టీ నేతలు నిరసనలు చేస్తుంటే డీజీపీ మహేందర్ రెడ్డి కి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలి కానీ.. తెలంగాణ లో మాత్రం అధికార పార్టీ నాయకులచే శబాష్ అనిపించుకునేందుకు పోలీస్ అధికారులు పోటీ పడుతున్నట్టు ఉందన్నారు. ఇప్పటికైన పోలీస్ అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని.. లేదంటే ప్రజల నుంచి మరింత వ్యతిరేకతను ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఎప్పుడూ TRS పార్టీ మాత్రమే అధికారంలో ఉండదన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు డీకే అరుణ.
పోలీసులు ప్రజల కోసం పని చేయాలి
- దేశం
- December 21, 2021
లేటెస్ట్
- 23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం
- మోదీ ధనవంతుల కోసం, కేసీఆర్ కాంట్రాక్టర్ల కోసం పని చేశారు : వివేక్ వెంకటస్వామి
- బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది.. మంత్రి శ్రీధర్ బాబు..
- ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీది : గడ్డం వంశీ కృష్ణ
- రెయిన్ ఎఫెక్ట్.. నిలిచిపోయిన పంజాబ్, బెంగళూరు మ్యాచ్
- అప్పుడు గుర్రాలు కదా : సమాధుల తవ్వకాల్లో 2 వేల 500 ఏళ్ల నాటి హెల్మెట్ దొరికింది..!
- తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ .. క్షమాపణ చెప్పాలె : ఎమ్మెల్యే హరీష్ రావు
- హెల్త్ అలెర్ట్: ప్రోటీన్ సప్లిమెంట్లతో రిస్క్.. ప్రోటీన్ పౌడర్లను వాడొద్దు:ICMR
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్కు 30 రోజులే.. స్టేడియం ఎలా ఉందంటే..?
Most Read News
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్