వర్షాలతో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండొద్దు

వర్షాలతో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండొద్దు

అధికారులకు మంత్రి జగదీశ్​ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్‌‌, వెలుగు: స్టేట్​లో వర్షాల ప్రభావంతో కరెంటు సరఫరాలో అంత రాయం కలుగకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంజా రాహిల్స్​లోని మినిస్టర్‌‌ క్వార్టర్స్‌‌లో ఎనర్జీ స్పెషల్‌‌ సెక్రటరీ సునీల్ శర్మ, ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, సదరన్‌‌ డిస్కం సీఎండీ రఘుమారెడ్డిలతో మంత్రి రివ్యూ నిర్వ హించారు. ఈ సందర్భంగా కరెంట్‌‌ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతటి భారీ వర్షాలు సంభవించినా కరెంటు సర ఫరా కొనసాగేలా చూడాలని సూచిం చారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా, అందుబాటులో ఉండే లా చూడాలని ఆదేశించారు. బ్రేక్ డౌన్ ఆయిన పక్షంలో అత్యవసరంగా రిస్టోర్​కు అవసరమైన సిబ్బందిని, మెటీరియల్​ను అందుబాటులో ఉంచాలని సూచించారు.