విదేశాల్లో రాజకీయ  వ్యాఖ్యలు ​చేయొద్దు : జగ్దీప్​ ధన్​కర్

విదేశాల్లో రాజకీయ  వ్యాఖ్యలు ​చేయొద్దు : జగ్దీప్​ ధన్​కర్

న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లేవారు ఎవరైనా సరే రాజకీయ దృక్పథాన్ని ఇక్కడే వదలి పెట్టాలని.. అక్కడికి వెళ్లాక పొలిటికల్ కామెంట్స్ చేయరాదని ఉప రాష్ట్రపతి జగ్దీప్​ ధన్​కర్​ సూచించారు. బాధ్యతా యుతంగా వ్యవహరించడమే వ్యక్తికి, దేశానికి కూడా ప్రయోజనకరమన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన వరల్డ్​హోమియోపతి దినోత్సవ కార్యక్రమం లో ఉప రాష్ట్రపతి జగ్దీప్​ ధన్​కర్​ మాట్లా డారు. ఇటీవల బ్రిటన్ పర్యటనలో రాహుల్ ​గాంధీ చేసిన కామెంట్లపై ఉప రాష్ట్రపతి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘విదేశీయులు మనదేశానికి వచ్చినప్పుడు వాళ్ల దేశాన్ని తిడుతున్నట్టు ఎప్పుడైనా చూశామా? దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా విదేశీగడ్డపై మాట్లాడటం సరికాదు’’ అని చెప్పారు. భారత కీర్తి ప్రతిష్టలను మరింత పెంచేలా ఎన్​ఆర్​ఐలు కృషి చేయాలని ధన్​కర్​ పిలుపునిచ్చారు.