డాక్టర్లు,హెల్త్ సిబ్బందిపై దాడి చేస్తే జైల్లో పెట్టండి

డాక్టర్లు,హెల్త్ సిబ్బందిపై దాడి చేస్తే జైల్లో పెట్టండి

హైదరాబాద్, వెలుగు: ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేస్తున్న డాక్టర్లు, హెల్త్‌‌‌‌సిబ్బందిపై దాడులు చేసే వాళ్లను ఉపేక్షించొద్ద ని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. అలాంటి వాళపై కేసులు పెట్టడమే కాకుండా జైల్లో పెట్టాలని ఆదేశించిం ది. కఠిన చర్యలు తీసుకోకుంటే వైద్యం చేసే వాళ్లలో మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. అరెస్టు చేసి జైళ్లకు పంపిన విషయాన్ని జనాలకు తెలిసేలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందంది. ఇలా చేస్తేనే దాడి చేయాలనే ఆలోచన రాకుండా కట్టడి చేయొచ్చని చెప్పింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. కరోనా బాధితులకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసే డాక్టర్లు , వైద్యసిబ్బందిపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యాయవా ది కైలాస్‌‌‌‌నాథ్‌ రాసిన లేఖను కోర్టు పిల్‌‌‌‌గా తీసుకొని బుధవారం విచారించింది.