మొరాయిస్తున్న సర్వర్లు.. ధరణి వద్దంటూ నిరసన

మొరాయిస్తున్న సర్వర్లు.. ధరణి వద్దంటూ నిరసన

హైదరాబాద్: మూసారాంబాగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్స్, భూ కొనుగోలు దారులు నిరసనకు దిగారు. మూసారాంబాగ్ ఆజంపురా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో  స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారులు, డాక్యుమెంట్ రైటర్స్  సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్టర్ గోదా దేవితో వాగ్వాదానికి దిగారు. ధరణి వద్దని పాత పద్దతిలోనే రిజస్ట్రేషన్ చేయాలని కార్యాలయం ముందు బైఠాయించారు. ధరణి వద్దు పాత కార్డ్ పద్ధతి ముద్దు” అంటూ నినాదాలు చేశారు.