కేటీఆర్ కు ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా?

కేటీఆర్ కు ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా?

ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ము కేటీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. హైదరాబాద్ ప్రజలకు డబుల్ డెక్కర్ కాదు.. డుబుల్ బెడ్రూం ఇళ్లు కావాలన్నారు ఎంపీ అర్వింద్. వరద సాయం ప్రజల పన్నులతోనే ఇస్తున్నారని.. మీ జేబులోంచి ఇవ్వడం లేదని కేటీఆర్ ను విమర్శించారు. హైదరాబాద్ ఎన్నికల కోసం  బీజేపీ నేతలు, కార్యకర్తలపై నోరు పారేసుకుంటే బాగోదని.. తమ కేడర్ ప్రజలకోసం పనిచేస్తుందన్నారు. 2017లో అసెంబ్లీలో కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ అమలు అసాధ్యమన్న కేటీఆర్.. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ పై మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

రూ.500 కోట్లు కేటాయించి రూ.250 కోట్లు దోచేశారు