మార్చురీలో డెడ్బాడీని పీక్కుతిన్న కుక్క..జడ్చర్ల పాత ఏరియా హాస్పిటల్లో ఘటన

మార్చురీలో డెడ్బాడీని పీక్కుతిన్న కుక్క..జడ్చర్ల పాత ఏరియా హాస్పిటల్లో ఘటన

మహబూబ్​నగర్/జడ్చర్ల, వెలుగు: పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లిన డెడ్​బాడీని కుక్క పీక్కుతిన్న ఘటన మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలోని పాత ఏరియా హాస్పిటల్​లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన పోలే భీమేశ్(33) గత శనివారం బహిర్భూమికి వెళ్లొస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించినా అతడి ఆచూకీ లభించలేదు.

కాగా సోమవారం ఉదయం భీమేశ్​గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలాడు. డెడ్​బాడీని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం జడ్చర్ల పాత ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న వార్డ్​బాయ్.. డెడ్​బాడీని మార్చురీలో ఉంచి గేటుకు తాళం వేసి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత అతడు తిరిగిరాగా వెనకాల ఓ కుక్క కూడా వచ్చింది. మార్చురీలోని భీమేశ్ డెడ్​బాడీ వేళ్లను పీక్కుతిన్నది. గమనించిన వార్డు బాయ్​కుక్కను తరిమేశాడు. సాయంత్రం భీమేశ్​డెడ్​బాడీకి డాక్టర్లు పోస్టుమార్టం పూర్తిచేసి, కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే డెడ్​బాడీని కుక్క పీక్కుతింటుండగా కొందరు వీడియో తీసి సోషల్​మీడియాలో పోస్ట్​చేయగా వైరల్​అయ్యింది.