బాలుడిపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు

బాలుడిపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి అలీ మసీద్​ఏరియాలో బుధవారం రాత్రి తొమ్మిదేండ్ల బాలుడిపై  కుక్కలు దాడి చేశాయి. షంషోద్దీన్​  కొడుకు ఉమర్ ఇంటి ఆవరణలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా వీధికుక్కలు దాడి చేశాయి. బాలుడి కాళ్లు, భుజం, పిక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. మెట్​పల్లి హాస్పిటల్​లో కుక్కకాటు ఇంజక్షన్లు లేకపోవడంతో ఉమర్ ను జగిత్యాల హాస్పిటల్ కు తీసుకెళ్లారు.