
ముషీరాబాద్, వెలుగు: సోషల్ మీడియా మాయలో విద్యార్థులు పడొద్దని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి సూచించారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేమ్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఒలంపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. విద్య ద్వారా కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.