స్ట్రీట్ వెండర్ల పొట్ట కొట్టొద్దు: మెట్టుగూడ కార్పొరేటర్

స్ట్రీట్ వెండర్ల పొట్ట కొట్టొద్దు: మెట్టుగూడ కార్పొరేటర్

పద్మారావునగర్, వెలుగు: చిరు వ్యాపారాలు చేసి పొట్టపోసుకుంటున్న వారి పొట్ట కొట్టొద్దని మెట్టుగూడ కార్పొరేటర్​ రాసూరి సునీత కోరారు. మెట్టుగూడలోని దాదాపు 150  స్ట్రీట్ వెండర్ల దుకాణాలను తొలగించడంతో శుక్రవారం సికింద్రాబాద్​ జోనల్ కమిషనర్​ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం స్ర్టీట్​ వెండర్స్​ కు అండగా ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం వారి జీవనోపాధిని కాలరాస్తోందని మండిపడ్డారు. వారికి మున్సిపల్​ కార్పొరేషన్​ నుంచి ఐడీ కార్డులు సైతం ఇచ్చారని, అవేమీ పట్టించుకోకుండా పోలీసులు దుకాణాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని సునీత కోరారు.