టెక్రియాల్​లో డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లకు రిపేర్

టెక్రియాల్​లో డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లకు రిపేర్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా టెక్రియాల్​లో నిర్మించిన డబుల్​బెడ్​ రూం ఇండ్లకు రిపేర్​చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్​లో  50 డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు నిర్మించగా అవి శిథిలమయ్యాయి. పునాదులు, బెస్​మిట్​ దగ్గర పగుళ్లు రావడం, బీమ్​లు, గోడల మధ్య గ్యాప్​ఏర్పడడంతో కంట్రాక్టర్​మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నెల 19న కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ  డబుల్​బెడ్​ రూమ్ ​ఇండ్లను పరిశీలించి లోపాలను ఎత్తిచూపారు. ఈ నెల 20న వెలుగులో  ‘గోడలకు పగుళ్లు.. కదులుతున్న పునాదులు' శీర్షకతో వార్త​ప్రచురితమైంది.  

టెక్రియాల్​డబుల్ ​బెడ్​ రూం ఇండ్ల వద్ద జరుగుతున్న రిపేర్లను డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్ శ్రీనివాస్​రావు శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా వస్తానని చెప్పిన ఎమ్మెల్యే, ఇప్పడు ఆగమేఘాల మీద మేస్ర్తీలను పెట్టించి మెరుగులు దిద్దుతున్నారని విమర్శించారు. చాలెంజ్​కు పోయి పైపై పనులు కాకుండా, ఇండ్లను పూర్తిగా తొలగించి కొత్తవి నిర్మించాలని డిమాండ్​ చేశారు.