డాక్టర్ బ్రూస్ కు జీనోమ్ వ్యాలీ ఎక్స లెన్స్ అవార్డు : ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు

డాక్టర్ బ్రూస్ కు జీనోమ్ వ్యాలీ  ఎక్స లెన్స్ అవార్డు :  ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు
  •     బయో ఏసియా సదస్సులో ప్రదానం చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: కేన్సర్ జీన్​థెరపీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్​బ్రూస్ లెవిన్​కు బయో ఏసియా సదస్సు వేదికగా జీనోమ్ ​వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందజేయనున్నట్టు ఐటీ మినిస్టర్ శ్రీధర్​ బాబు తెలిపారు. 

ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ ​ట్రీట్​మెంట్​లో కొత్త అధ్యాయం తీసుకొచ్చారని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్​టీ సెల్​ థెరపీ, జీన్ ఎడిటింగ్​వంటి వాటితో కేన్సర్ ట్రీట్​మెంట్​కు కొత్త బాటలు వేశారన్నారు. ఇమ్యునోథెరపీకి కొత్త బెంచ్​మార్క్స్ సెట్ చేయడంతో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్టు పేర్కొన్నారు.