కేసీఆర్ దుకాణం క్లోజ్ : కిరణ్ కొమ్రేవార్

కేసీఆర్ దుకాణం క్లోజ్ : కిరణ్ కొమ్రేవార్

భైంసా, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దుకాణం క్లోజ్​ అయినట్టేనని కాంగ్రెస్ ​నేత డా.కిరణ్ కొమ్రేవార్​ అన్నారు. ఆదివారం భైంసాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు బీఆర్​ఎస్ మ్యానిఫెస్టోని నామమాత్రంగా అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈసారి కూడా ఆ పార్టీ అమాయక ప్రజలకు తప్పుడు హామీలిస్తోందని ఫైర్ ​అయ్యారు.

ఎన్నికల వేళ కేసీఆర్ ​కొత్త నాటకానికి తెరలేపారన్నారు. ఉచిత హామీలు ప్రజలకు అవసరం లేదని.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పేద ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వ్యవస్థలను మెరుగుపర్చితే చాలన్నారు. వచ్చేది కాంగ్రెస్ ​ప్రభుత్వమేనని, ఖచ్చితంగా తమ పార్టీ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. లీడర్లు దేవీదాస్, మహేశ్, కిరణ్​తదితరులున్నారు.