
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం జనగాలంచ ఆదివాసి గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. గూడెంలో ఉండే ఒక్క చేతి పంపు పని చేయక నెలరోజులు గడుస్తుండగా, గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శనివారం ఆదివాసి సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి పని చేయని చేతి పంపును గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయన వెంటగూడెం వాసులు మడవి రాము, మడకం సంతోష్, మడకం వికాస్, పుంజా జ్యోతి, శ్యామల, జోగయ్య, కుంజా లక్ష్మయ్య తదితరులున్నారు.