
ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనూ అద్భుతమైన థ్రిల్లర్ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకోవచ్చని ప్రూవ్ చేసిన సినిమా ‘దృశ్యం’. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో మెప్పించిన ఈ చిత్రం ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో రీమేక్ అయింది. అంతేకాదు దీనికి సీక్వెల్గా వచ్చిన ‘దృశ్యం 2’ కూడా మెప్పించింది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు ‘దృశ్యం 3’ ఉండబోతోందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికీ గుడ్ న్యూస్ చెబుతూ శనివారం ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు..’ అంటూ మోహన్ లాల్ ఓ వీడియోను షేర్ చేశారు. అక్టోబర్లో షూట్ మొదలవబోతోందని ఇందులో రివీల్ చేశారు.
జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్ నిర్మిస్తున్నారు. అనుకోకుండా తన ఇంట్లో జరిగిన క్రైమ్ నుంచి చట్టానికి దొరక్కుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ కామన్మ్యాన్ ఏం చేశాడనేది ఈ ఫ్రాంచైజీ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు అజయ్ దేవగణ్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యాయి. ఈసారి థర్డ్ పార్ట్ సెట్స్కు వెళ్లకుండానే సొంత కథతో ‘దృశ్యం 3’ అనౌన్స్ చేశారు అజయ్ దేవగణ్. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అక్టోబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభించి మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. మరోవైపు పక్కా ప్లానింగ్, బౌండెడ్ స్క్రిప్ట్తో సినిమాలు తీసే జీతూ జోసెఫ్కు తక్కువ వర్కింగ్ డేస్లో సినిమాను పూర్తి చేస్తాడనే పేరుంది. మరి ఒకే ఫ్రాంచైజీలో రెండు వేర్వేరు కథలతో వస్తున్న ఈ రెండు చిత్రాల్లో.. ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి!