కోల్బెల్ట్, వెలుగు: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం మంచిర్యాల, మందమర్రి స్టేషన్లలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో 100 కేవీసోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వేలో మంచిర్యాల అత్యంత కీలకమైన స్టేషన్ అని తెలిపారు. రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులు 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు.
వినతుల వెల్లువ..
డీఆర్ఎంకు వివిధ పార్టీల లీడర్లు, కార్మిక, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు రైల్వే సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. మందమర్రి స్టేషన్లో సింగరేణి, రామగిరి ప్యాసింజర్లు, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ కల్పించాలని, రెండో ప్లాట్ఫాం మీద టికెట్ కౌంటర్ ఏర్పాటు, నార్లాపూర్ అండర్బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. మంచిర్యాల స్టేషన్లో చైన్నై నుంచి భగత్ కి కోటి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్, మరిన్ని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని శ్రీరాందేవ్ సేవా సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

