ఇండియన్ జెనోమిక్స్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు

ఇండియన్ జెనోమిక్స్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు

చర్లపల్లిలోని ఇండియన్ జెనోమిక్స్ కంపనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు 2024 ఫిబ్రవరి 7న దాడులు నిర్వహించారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయోటిక్ ఇంజక్షన్లు తయారీ.. ఇంజక్షన్ల ద్వారా డీఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

కిమోతెరఫీలో ఇంజక్షన్లు వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు.. అనుమతులు లేకుండా ఇంజక్షన్లు తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులకు వచ్చిన పక్కా సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఇంజక్షన్లు వాడడం వల్ల మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకొని డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారులు విచారిస్తున్నారు.